8వ పే కమిషన్ కీలక దశ పూర్తి.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన షురూ
- వినతుల స్వీకరణ పూర్తి చేసిన 8వ వేతన సంఘం
- అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్, పాత పెన్షన్ పునరుద్ధరణపై ఉద్యోగ సంఘాల డిమాండ్
- 55 లక్షల ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరే అవకాశం
- దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో కమిషన్ సంప్రదింపులు
- జీతాల పెంపులో కీలకం కానున్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నుంచి వినతులు, మెమొరాండంలు స్వీకరించే ప్రక్రియ జూన్ 15వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం ఈ డిమాండ్లను క్షుణ్ణంగా పరిశీలించే పనిలో కమిషన్ నిమగ్నమైంది. తుది సిఫార్సులు చేసే ముందు ఈ డిమాండ్లన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేయనుంది.
2025 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్కు, తన నివేదికను పూర్తి చేయడానికి దాదాపు 10 నెలల సమయం కేటాయించారు. ఈ సిఫార్సుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులలో మార్పులు జరగనున్నాయి. దీంతో కోటి మందికి పైగా ప్రజలు ఈ కమిషన్ సిఫార్సుల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..
ఉద్యోగ సంఘాలు తమ మెమొరాండంలలో ప్రధానంగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించాయి. ముఖ్యంగా, జీతాల పెంపులో కీలకమైన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని సంఘాలు 3.15 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేయాలని కోరుతున్నాయి. దీంతో పాటు కనీస మూల వేతనాన్ని (Minimum Basic Pay) భారీగా పెంచాలని కూడా విజ్ఞప్తి చేశాయి.
అంతేగాక ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ పెన్షన్ విధానం (ఎన్పీఎస్) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలన్నది ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్గా ఉంది. వీటితో పాటు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ), రిస్క్ పే, బోనస్లు, సెలవు ప్రయోజనాలు, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మెరుగుపరచాలని కోరాయి.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్పైనే ఉత్కంఠ
వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకం. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత మూల వేతనాన్ని కొత్త వేతన స్కేల్కు మార్చడానికి ఉపయోగించే గుణకాన్నే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఈసారి ప్రభుత్వం 2.5 కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం 3.15 ఆశిస్తున్నాయి. దీనిపై కమిషన్ ఏ మేరకు సిఫార్సు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే కమిషన్ ఢిల్లీ, లడఖ్, జమ్మూ కశ్మీర్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలో సంప్రదింపులు పూర్తి చేసింది. రానున్న రోజుల్లో జూలై వరకు లక్నో, భువనేశ్వర్, కోల్కతాలలో పర్యటించి ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుంది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం 2026 జనవరిలో కరవు భత్యం (డీఏ), కరవు ఉపశమనం (డీఆర్) 2 శాతం పెంచి, మొత్తం రేటును 60 శాతానికి చేర్చింది. తదుపరి డీఏ పెంపు ఈ ఏడాది మే, జూన్ నెలల ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ గణాంకాలపై ఆధారపడి ఉంటుంది.
2025 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్కు, తన నివేదికను పూర్తి చేయడానికి దాదాపు 10 నెలల సమయం కేటాయించారు. ఈ సిఫార్సుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులలో మార్పులు జరగనున్నాయి. దీంతో కోటి మందికి పైగా ప్రజలు ఈ కమిషన్ సిఫార్సుల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..
ఉద్యోగ సంఘాలు తమ మెమొరాండంలలో ప్రధానంగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించాయి. ముఖ్యంగా, జీతాల పెంపులో కీలకమైన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని సంఘాలు 3.15 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేయాలని కోరుతున్నాయి. దీంతో పాటు కనీస మూల వేతనాన్ని (Minimum Basic Pay) భారీగా పెంచాలని కూడా విజ్ఞప్తి చేశాయి.
అంతేగాక ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ పెన్షన్ విధానం (ఎన్పీఎస్) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలన్నది ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్గా ఉంది. వీటితో పాటు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ), రిస్క్ పే, బోనస్లు, సెలవు ప్రయోజనాలు, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మెరుగుపరచాలని కోరాయి.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్పైనే ఉత్కంఠ
వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకం. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత మూల వేతనాన్ని కొత్త వేతన స్కేల్కు మార్చడానికి ఉపయోగించే గుణకాన్నే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఈసారి ప్రభుత్వం 2.5 కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం 3.15 ఆశిస్తున్నాయి. దీనిపై కమిషన్ ఏ మేరకు సిఫార్సు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే కమిషన్ ఢిల్లీ, లడఖ్, జమ్మూ కశ్మీర్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలో సంప్రదింపులు పూర్తి చేసింది. రానున్న రోజుల్లో జూలై వరకు లక్నో, భువనేశ్వర్, కోల్కతాలలో పర్యటించి ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుంది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం 2026 జనవరిలో కరవు భత్యం (డీఏ), కరవు ఉపశమనం (డీఆర్) 2 శాతం పెంచి, మొత్తం రేటును 60 శాతానికి చేర్చింది. తదుపరి డీఏ పెంపు ఈ ఏడాది మే, జూన్ నెలల ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ గణాంకాలపై ఆధారపడి ఉంటుంది.